Hyderabad | భానుడి భగ భగకు నగరంలోని రోడ్లు వెలవెలబోతున్నాయి. మే నెల రాకముందే నిప్పుల కొలిమిలా మారింది పరిస్థితి. ఉదయం పదకొండు గంటల నుంచే ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం తెలుగుతల్లి ఫ్లైఓవర్ నిర్మానుష్యంగా మారింది. రానున్న మూడు రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.