సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ) : మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్కేవీ నాయకులు తెలిపారు. నాచారంలోని సిటీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రేవంత్రెడ్డి అనుచరులే మంత్రిపై దాడికి యత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాడి చేసిన వారిని గుర్తించి పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్కేవీ ఉపాధ్యక్షుడు వేముల మారయ్య, కార్యదర్శి కోరేపాక అంజన్న, మేడ్చల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శాతం రమేశ్, టి. కుమార్, సీహెచ్.సాయికుమార్, సుద్దాల రవి తదితరులు పాల్గొన్నారు.