27న జరిగే వేడుక ఏర్పాట్లలో
3 జిల్లాల ప్రజాప్రతినిధులు
సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 27న జరగనున్న టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేరకు సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజాప్రతినిధులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ప్రత్యేకంగా సమావేశమైయ్యారు. వివిధ కమిటీలకు నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు.
నిర్వహణ కమిటీల బాధ్యులు వీరే..!
ఆహ్వాన కమిటీ
మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
సభా వేదిక అలంకరణ
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేషన్ల చైర్మన్లుబాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
ప్రతినిధుల నమోదు, వాలంటరీ
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కార్పొరేషన్ల చైర్మన్లు మన్నె క్రిశాంక్, శ్రీధర్ రెడ్డి రావుల
పార్కింగ్ – కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్, పార్టీ జనరల్ సెక్రటరీ బండి రమేశ్, మాజీ మేయర్ బొంతు రాంమోహన్
ప్రతినిధులకు భోజనం
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్, మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి