కేపీహెచ్బీ కాలనీ, ఫిబ్రవరి 4 : ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మల్లేశ్ యాదవ్ తిరిగి టీఆర్ఎస్లో కొనసాగేందుకు ఎమ్మెల్యే కృష్ణారావును కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్లో కష్టపడి పనిచేసిన నాయకులందరికీ తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు.
ఉద్యమ నేతలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని.. సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించే బాధ్యత టీఆర్ఎస్ నేతలపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆవుల రవీందర్ రెడ్డి, పండాల సతీశ్ గౌడ్, మాజీ కార్పొరేటర్ బాబురావు, గౌసుద్దీన్ తదితరులు ఉన్నారు.