మెహిదీపట్నం ఏప్రిల్ 10: తెలంగాణ వడ్లు కొనాలన్న డిమాండ్తో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి చేపట్టనున్న రైతు దీక్షలో పాల్గొనడానికి నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గం నాయకులు తరలివెళ్లారు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్రావులతో పాటు సీనియర్ నాయకులు కావూరి వెంకటేష్లు ఢిల్లీకి వెళ్లారు.