హిమాయత్నగర్, ఆగస్టు1 : ఈ నెల 7న నేతన్నకు బీమా పథకాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో సోమవారం నారాయణగూడలోని పద్మశాలీ భవన్లో తెలంగాణ పద్మశాలి సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారి భాస్కర్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, గ్రేటర్ ప్రధాన కార్యదర్శి కల్లెపలి రాజు, నాయకులు వల్లపు కృష్ణమూర్తి, రాజన్బాబు, తుకారం, హరీశ్, శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.