మంత్రి చామకూరి మల్లారెడ్డి
ఉప్పల్, ఏప్రిల్ 6 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి చామకూరి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం నాచారం డివిజన్, ఎర్రకుంటలో రూ. 65 లక్షలతో చేపట్టిన లాల్ బహుదూర్ శాస్త్రి సామాజిక భవనాన్ని, రూ.94 లక్షలతో చేపట్టిన కార్తికేయ నగర్ ఎంట్రన్స్లో 30 అడుగుల బాక్స్ కల్వర్టును, రూ.74 లక్షలతో చేపట్టిన అంబేద్కర్నగర్లో పాతబ్రిడ్జి స్థానంలో కొత్త బాక్స్ కల్వర్డును, రూ.73 లక్షలతో చేపట్టిన న్యూ అంబేద్కర్నగర్లో శిథిలావస్థకు చేరిన పాతబ్రిడ్జి స్థానం లో విశాల మైన బాక్స్ కల్వర్టు పనులను వారు .. తాడూరి శ్రీనివాస్, నగర డిప్యూటీ మేయర్ శ్రీ లతా శోభన్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలనీల సమస్యలు పరిష్కా రం అవుతున్నాయన్నారు. డివిజన్లు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కార్యక్రమం లో టీటీయూసీ అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, ఎల్బీనగర్ ఎస్ఈ అశోక్రెడ్డి, డీఈ స్వరూప, ఏఈ లింగారావు, వర్క్ఇన్స్పెక్టర్ విజయ్కుమార్, పోలీస్ ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్, నాయకులు డివిజన్ అధ్యక్షుడు మేకల ముత్యంరెడ్డి, కొరపాక అంజి, నాయకులు పాల్గొన్నారు.