ఆర్మూర్, మార్చి 11 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని పత్తేపూర్ గ్రామానికి చెందిన పలు పార్టీల నాయకులు హైదరాబాద్ తరలివెళ్లి జీవన్రెడ్డి సమక్షంలో శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పత్తేపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి గంగారాం, గంగాధర్, తలారి రాజేశ్వర్, కంతి జాన్, యేసులకు జీవన్రెడ్డి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ పటిష్టతకు పాత, కొత్త తరం నాయకులందరూ కృషి చేయాలని జీవన్రెడ్డి సూచించారు. కార్యక్రమంలో ఫత్తేపూర్ సర్పంచ్ కొత్తపల్లి లక్ష్మి, ఎంపీటీసీ నక్కల హన్మాండ్లు, టీఆర్ఎస్ నాయకులు అశోక్రెడ్డి, సహోదర్రెడ్డి, వజ్రంరెడ్డి, పట్టణ నాయకుడు ఎస్ఆర్.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.