హైదరాబాద్ : ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ జగజ్యోతిని(Jagajyothi) ఏసీబీ(ACB) అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు 14 రోజుల పాటు రిమాండ్(Remand) విధించింది. మార్చ్ 6 వరకు జ్యోతికి కోర్టు రిమాండ్ విధిస్తున్నట్లో కోర్టు పేర్కొన్నది. ఆమెను చంచల్గూడ మహిళా జైలుకు తరలించాలని సూచింది. కాగా, జగజ్యోతిని కొద్దిసేపటి క్రితం ఉస్మానియా దవాఖాను( Osmania Hospital) నుంచి డిశ్చార్జ్(discharged) చేశారు.
వెంటనే ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా కోర్ట్ పై విధంగా రిమాండ్ విధించింది. కాగా, రూ. 84 వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇంట్లో సోదాలు చేసే సమయంలో ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటి వరకు మొత్తం రూ. 65 లక్షల నగదు, 4 కిలోల బంగారం ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జ్యోతి ఆస్తులు మరికొన్ని బీనామీలపై ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది.