సిటీబ్యూరో, ఏఫ్రిల్ 28 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో పరిపాలనాపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పలువురు డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే అమల్లోకి వచ్చేలా ఐదుగురు అధికారులకు స్థానచలనం కల్పించారు. భాస్కర్ రెడ్డి మూసారాంబాగ్ (సరిల్-29) నుంచి సంతోష్ నగర్ (సరిల్-25)కు బదిలీ అయ్యారు.
మంగతాయారు సంతోష్ నగర్ (సరిల్-25) నుంచి మూసారాంబాగ్ (సరిల్-29)కు బదిలీ అయ్యారు పాపయ్య జంగమ్మెట్ (సరిల్-24) నుంచి చాంద్రాయణగుట్ట (సరిల్-23) కు వెళ్లారు. సురేందర్ చాంద్రాయణగుట్ట (సరిల్-23) నుంచి జంగమ్మెట్ (సరిల్-24)కు, ఎం.ఎన్.ఆర్ జ్యోతి తార్నాక (సరిల్-43) నుంచి మెట్టుగూడ (సరిల్-44) కు బదిలీ అయ్యారు, సుధీర్ సింగ్ను మెట్టుగూడ (సరిల్-44) నుంచి తార్నాక (సరిల్-43) కు బదిలీ చేశారు.
వీరితో పాటు హెడ్ ఆఫీస్లో ఉన్న ఆర్.వి. విజయలక్ష్మి (డిప్యూటీ కమిషనర్, ఎలక్షన్స్)ను ఎస్టేట్ ఆఫీసర్గా నియమించారు. ఎలక్షన్ విభాగంలో ఏఎంసీగా ఉన్న సంధ్యారాణిని గోషామహల్ (సరిల్-30) కు బదిలీ చేశారు. బదిలీ అయిన అధికారులు వెంటనే తమ బాధ్యతల నుంచి తప్పుకొని కొత్త ప్రాంతాల్లో బాధ్యతలు స్వీకరించి నివేదిక సమర్పించాలని కమిషనర్ ఆదేశించారు.