హైదరాబాద్ : చట్ట విరుద్ధంగా భూవివాదంలో(Land diputes) తలదూర్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) సీఐ ఆంజనేయులు(CI Anjaneyulu)పై బదిలీ(Transfer ) వేటు పడింది. ఈ మేరకు రాచకొండ సీపీ సీఐని బదిలీ చేస్తూ రాచకొండ కమిషనరేట్కు అటాచ్ చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ బాధ్యతలను యాచారం సీఐకి అప్పగించారు. పోలీసులు భూ వివాదంలో తలదూర్చొద్దని ఎవరైనా అలాంటి పనులకు పాల్పడితే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.