మేడ్చల్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. రంగారెడ్డి కలెక్టర్గా ఉన్న అమోయ్కుమార్ను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్గా నియమించారు. ఇదే సమయంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే మేడ్చల్ ఇన్చార్జి కలెక్టర్గా పని చేస్తున్న మెదక్ కలెక్టర్ ఎస్.హరీశ్ను రంగారెడ్డి కలెక్టర్గా బదిలీ చేశారు.