హైదరాబాద్ : ఎల్బీస్టేడియంలో మంగళవారం సాయంత్రం జరిగే క్రిస్మస్ విందుకు ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు హాజర వుతున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ విజయ్కుమార్ తెలిపారు.
మళ్లింపు ఇలా..
ఏఆర్ పెట్రోల్ పంప్ వైపు నుంచి బీజేఆర్ విగ్రహం వైపు ట్రాఫిక్ను అనుమతించరు. చాపల్రోడ్డుకు మళ్లిస్తారు.
అబిడ్స్, గన్ఫౌండ్రీ నుంచి బీజేఆర్ విగ్రహం వైపునకు కాకుండా.. ఎస్బీఐ గన్పౌండ్రీ నుంచి చాపల్రోడ్డు వైపునకు పంపిస్తారు.
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ బషీర్బాగ్ నుంచి వచ్చే వాహనాలు లిబర్టీ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
పార్కింగ్ అలా..
-గోల్డ్ కార్డు పాసులు(ఏ బ్లాక్) ఉన్న వారు ఏ గేట్ సమీపంలో ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్కు ఎదురుగా ఉండే గేట్ నం.17 నుంచి వచ్చి టెన్నిస్ కోర్టులో వాహనాలను పార్క్ చేయాలి.
-గోల్డ్కార్డు పాసులు( ఏ1 బ్లాక్)- ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ ఎదురుగా ఉన్న బీ గేట్ ద్వారా.. ఫతే మైదాన్ క్లబ్ ఎంట్రెన్స్ నుంచి లోపలికి వచ్చి.. అలియా మోడల్ స్కూల్, మహబూబ్కాలేజీ, అలియా కాలేజీ, స్టన్లీ ఇంజినీరింగ్ కాలేజీలో వాహనాలు పార్కింగ్ చేయాలి.
-గ్రీన్కార్డు పాసులు(ఏ2 బ్లాక్)-ఎస్ఏటీఎస్ గేట్ నుంచి లోపలికి రావాలి. వాహనాలను నిజాం కాలేజీ గ్రౌండ్లో నిలుపాలి.
-బ్లూ కార్డు పాసులు(బీ-బ్లాక్)- అయాకర్ భవన్ ఎదురుగా ఉన్న జీ గేట్ వద్ద ఆగి..ఇన్నర్ గేట్ 15 నుంచి లోపలికి వచ్చి వాహనాలను పబ్లిక్ గార్డెన్స్లో పార్క్ చేయాలి.
-పింక్ కార్డు పాసులు(సీ-బ్లాక్) – బీజేఆర్ విగ్రహం సమీపంలోని ఎఫ్, ఎఫ్1 గేట్ల వద్ద ఆగి, లోపలి గేట్లు 6, 8 నుంచి లోపలికి రావాలి. వాహనాలను నిజాం కాలేజీ గ్రౌండ్లోకి గేట్ నం. 4 నుంచి వెళ్లి పార్క్ చేయాలి.
-మీడియా వాహనాలు బీజేఆర్ విగ్రహం సమీపంలోని డీ గేట్ వద్ద వాహనాలను ఆపి.. స్టాట్స్ గేట్ నుంచి లోపలికి రావాలి. ఎస్సీఈఆర్టీ ప్రాంగణంలో పార్క్ చేయాలి. నిర్ణీత సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనుండడంతో ఆ సమయంలో ఆయా రూట్లలో వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు.