Hyderabad | న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగున్నాయి. ఇక బేగంపేట, టోలీచౌకీ ఫ్లైఓవర్ మినహా మిగతా ఫ్లైఓవర్లన్నీ రాత్రి 10 నుంచి జనవరి 1వ తేదీ ఉదయం వరకు అవనసరాన్ని బట్టి బంద్ చేస్తామని ఇంచార్జి ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. అన్ని ప్రైవేటు వాహనాలు సిటీలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు.
ట్యాంక్బండ్, నెక్లస్ రోడ్ వంటి చోట్ల రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున రెండుగంటల వరకు వాహనాల రాకపోకలు నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. 217 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తారని, ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లస్రోడ్ వంటి రద్దీ ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ ఉన్నచోట ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. ఫ్లైట్ టికెట్ ఉంటేనే పీవీ ఎక్స్ప్రెస్ హైవే పైకి అనుమతించనున్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు రాత్రి ఎనిమిది గంటలనుంచే కొనసాగుతాయని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్,ట్రాఫిక్ నిబంధనలకు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.