హైదరాబాద్ : ఈ నెల 21న నగరంలోని కైత్లాపూర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ కోరారు.
-ఎర్రగడ్డ నుంచి హైటెక్ సిటీకి వయా మూసాపేట్ మీద వచ్చే వాహనాలను మూసాపేట్ జంక్షన్ – వైజంక్షన్ – కూకట్పల్లి – రోడ్డు నెం.1- కేపీహెచ్బీ – జేఎన్టీయూ – హైటెక్ సిటీ మీదుగా మళ్ళిస్తారు.
-బాలానగర్ నుంచి వై-జంక్షన్ వయా హైటెక్ సిటీ వెళ్ళే వాహనాలను ఐడీఎల్ ట్యాంక్ నుంచి – కూకట్పల్లి – రోడ్డు నెం.1 – కేపీహెచ్బీ – జేఎన్టీయూ – హైటెక్ సిటీ వైపు పంపిస్తారు.
-హఫీజ్పేట్, ఆర్యూబీ వైపు నుంచి కైత్లాపూర్కు వచ్చే వాహనాలను ఆర్యూబీ – జేఎన్టీయూ వైపు మళ్లిస్తారు.