హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన మైండ్ స్పేస్ వద్ద మెట్రో రెండో దశ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. మాదాపూర్, నార్సింగి పోలీసు స్టేషన్ల పరిధిలో ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. మాదాపూర్లోని రహెజ, మైండ్స్పేస్ జంక్షన్తో పాటు పరిసర ప్రాంతాల్లో 9వ తేదీన ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
-ఆర్వోబీ కేపీహెచ్బీ నుంచి బయోడైవర్సిటి జంక్షన్, ఐకియా అండర్పాస్ మీదుగా వచ్చే వాహనాలను సైబర్ టవర్ వద్ద దారిమళ్లించి సీఓడీ -నెక్టర్ గార్డెన్స్, ఐ-ల్యాబ్-ఐటీసీ కోహినూర్, ఎన్సీబీ, ఖాజాగూడ మీదుగా అనుమతిస్తారు.
-సైబర్ టవర్ ఫ్లైఓవర్ నుంచి బయోడైవర్సిటీ మీదుగా అనుమతి లేదు.
-కేపీహెచ్బీ నుంచి గచ్చిబౌలి వయా సైబర్ టవర్ ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలను సైబర్ టవర్ వద్ద దారిమళ్లించి మెటల్ చార్మినార్, సిఐఐ జంక్షన్-కొత్తగూడ-గచ్చిబౌలి మీదుగా అనుమతిస్తారు.
-హైటెక్స్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ వయా సైబర్ టవర్ నుంచి వచ్చే వాహనాలను సైబర్ టవర్ వద్ద దారిమళ్లించి నెక్టర్ గార్డెన్స్, ఐ-ల్యాబ్స్-ఐటీసీ-కోహినూర్, ఎన్సీబీ, ఖాజాగూడ మీదుగా అనుమతిస్తారు.
-సీఐఐ, టెక్ మహీంద్ర, డెల్ నుంచి బయోడైవర్సిటీ, ఇన్ఆర్బిట్మాల్ మీదుగా వచ్చే వాహనాలను టీసీఎస్ జంక్షన్ వద్ద దారి మళ్లించి సైబర్టవర్, సిఒడి జంక్షన్, నెక్టర్ గార్డెన్, ఐ-ల్యాబ్-ఐటీసీ మీదుగా ఎన్సీబి, ఖాజాగూడ వైపు అనుమతిస్తారు.
-చేవెళ్ల, మొయినాబాద్ నుంచి హైదరాబాద్ సిటీ, బండ్లగూడ, కాళిమందిర్, సన్సిటీ, రాజేంద్రనగర్, ఆర్జిఐఎ వైపు వచ్చే వాహనాలను గురు రాఘవేంద్ర హోటల్, టీఎస్పిఎ-నార్సింగి రోటరీ-గచ్చిబౌలి, లంగర్హౌస్ మీదుగా అనుమతిస్తారు.
-గచ్చిబౌలి, శంకర్పల్లి నుంచి రాజేంద్రనగర్ బండ్లగూడ, కాళిమందిర్, మొయినాబాద్, చేవెళ్ల వైపు నుంచి వచ్చే వాహనాలను నార్సింగి రోటరీ-1-తారామతి బారామతి-టిపుఖాన్ బ్రిడ్జ్-బండ్లగూడ-కాళీమందిర్ మీదుగా దారిమళ్లిస్తారు.
-టిప్పుఖాన్ బ్రిడ్జ్ నుంచి మొయినాబాద్, చేవెళ్ల వైపు వచ్చే వాహనాలను కాళీమందిర్ వై-జంక్షన్-లార్డ్స్ కాలేజ్-హిమాయత్సాగర్-టీఎస్పిఎ రోటరీ-2 మీదుగా దారిమళ్లిస్తారు.
-శంషాబాద్ ఓఆర్ఆర్ నుంచి కాళిమందిర్, బండ్లగూడ, సన్సిటీ, హైదరాబాద్ సిటీ, మొయినాబాద్, చేవెళ్ల వైపు వెళ్లే వాహనాలను ఎగ్జిట్-18 మీదుగా అనుమతించరు. ఎగ్జిట్ 17 లేదా ఎగ్జిట్ 01 లేదా ఎగ్జిట్ గచ్చిబౌలి టోల్ ఎగ్జిట్-19 మీదుగా అనుమతిస్తారు.
-గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి కాళిమందిర్, బండ్లగూడ, సన్సిటీ, మొయినాబాద్, చేవెళ్ల వైపు వెళ్లే వాహనాలను ఎగ్జిట్-18 మీదుగా అనుమతించరు. వీరు ఎగ్జిట్-17 మీదుగా వెళ్లాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.
-రాజేంద్రనగర్ నుంచి కాళిమందిర్, బండ్లగూడ, సన్సిటీ వైపు వెళ్లే వాహనాలను రాజేంద్రనగర్ ఓర్ఆర్ టోల్గేట్ వద్ద దారి మళ్లించి, రాజేంద్రనగర్ విలేజ్, బుద్వేల్, కిస్మత్పూర్, కాళిమందిర్ మీదుగా అనుమతిస్తారు.