Traffic Alert | సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉప్పల్ స్టేడియంలో శనివారం జరిగే టీ-20 క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు రాచకొండ సీపీ ఓ ప్రకటనలో తెలిపారు. మ్యాచ్ను తిలకించేందుకు వేలాదిగా సందర్శకులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఉప్పల్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో నిర్దేశిత ప్రాంతాల నుంచి వాహనదారులు వెళ్లాల్సి ఉంటుందని సూచించారు. 12న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.50 గంటలకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు.