హైదరాబాద్ : నార్సింగి ఫ్లైఓవర్ నుంచి గండిపేట మార్గంలో టీఎస్ ట్రాన్స్కో అధికారులు హైటెన్షన్ స్తంభాలు ఏర్పాటు చేస్తుండటంతో ఈ మార్గంలో 10 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. డిసెంబర్ 15 నుంచి 24వ తేదీ వరకు వాహనాలను దారి మళ్లించనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్కుమార్ తెలిపారు.
-మంచిరేవుల వ్యాసన్నగర్ నుంచి వచ్చే వాహనాలు నార్సింగి వైపు..
-నార్సింగి నుంచి వచ్చే వాహనాలు టీఎస్పీఏ వైపు..
-నార్సింగి అండర్ బ్రిడ్జి దగ్గర వెర్టెక్స్ నుంచి వచ్చే వాహనాలు కోకాపేట మీదుగా నార్సింగి బ్రిడ్జి వైపు..