హైదరాబాద్ : ఎన్టీఆర్ మార్గ్లో ఈ నెల 19, 20వ తేదీల్లో జరుగనున్న ఫార్ములా ఈ-రేస్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల16వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 20వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ రేస్లు నెక్లెస్ రోటరీ నుంచి తెలుగుతల్లి జంక్షన్, ఓల్డ్ సెక్రటేరియట్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్, మింట్ కంపౌండ్ మీదుగా ఐమాక్స్ వరకు సాగుతాయన్నారు.
-వీవీ విగ్రహం(ఖైరతాబాద్) వైపు నుంచి నెక్లెస్ రోటరీ వైపు ట్రాఫిక్ అనుమతి లేదు. వీవీ విగ్రహం వద్ద షాదాన్ కాలేజ్, రవీంధ్రభారతి వైపు మళ్లిస్తారు.
-బుద్దభవన్, నల్లంపట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్, ట్యాంక్బండ్ వైపు మళ్లిస్తారు.
-రసూల్పురా, మినిస్టర్ రోడ్డు నుంచి నెక్లెస్ రోటరీ వైపు నల్లగుట్ట మీదుగా వచ్చే వాహనాలను, నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.
-ఇక్బాల్ మినార్ నుంచి తెలుగుతల్లి జంక్షన్, ట్యాంక్ బండ్ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను ఫ్లై ఓవర్పై నుంచి కట్టమైసమ్మ ఆలయం, లోయర్ ట్యాంక్బండ్ వైపు వెళ్లాలి.
-ట్యాంక్బండ్, తెలుగుతల్లి నుంచి నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. తెలుగు తల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి జంక్షన్ వైపు వెళ్లాలి.
-బీఆర్కే భవన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్మినార్, రవీంద్ర భారతి జంక్షన్కు మళ్లిస్తారు.
-ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్కంపౌండ్ వైపు వాహనాలను అనుమతి లేదు. ఈ వాహనాలను రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
-ఖైరతాబాద్ బడా గణేష్ వైపు నుంచి ప్రింటింగ్ ప్రెస్, నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను బడా గణేష్ వద్ద రాజ్దూత్ లైన్లోకి మళ్లిస్తారు.
అఫ్జల్గంజ్ నుంచి ట్యాంక్బండ్ మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలు, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, కట్టమైసమ్మ, లోయర్ ట్యాంక్బండ్, బీబీఆర్ మిల్స్, కవాడిగూడ రూట్లలోకి మళ్లిస్తారు.