సిటీబ్యూరో, మార్చ్7(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈనెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నగర వ్యాప్తంగా సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించారు.
తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ అధికారులు వాహనాలను ఆపి లైసెన్స్లను పరిశీలించి చెల్లుబాటులో లేని లైసెన్స్తో ఉన్న వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి మొత్తం 1940 కేసులు నమోదు చేశారు. మైనర్లకు లేదా లైసెన్స్ లేని వ్యక్తులకు వాహనాలను ఇవ్వవద్దని వాహన యజమానులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.