హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు (Traffic Jam) నిలిచిపోయాయి. దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. దీంతో ఆర్టీసీ బస్సులు, కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ మార్గంలో హయత్నగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పండుగకు వెళ్లే వాహనాలకు తోడు భారీ వర్షాలు తోడవడంతో ఎల్బీనగర్ నుంచి అబ్దుల్లాపూర్మెట్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. అదేవిధంగా జిల్లాలకు వెళ్లే బస్సులను దిల్సుఖ్నగర్ వద్ద మళ్లిస్తుండటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
భారీ వర్షాల కారణంగా అబ్దుల్లాపూర్మెట్ మండలం గౌరెల్లి వద్ద బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గౌరెల్లి బ్రిడ్జి వద్ద బారికేట్లు ఏర్పాటు చేసిన పోలీసులు స్థానికులను అప్రమత్తం చేశారు. మరోవైపు ఉప్పల్ చౌరస్తా వద్ద వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి.