Traffic Jam | హైదరాబాద్ : పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో కారులో మంటలు చెలరేగాయి. దీంతో ఖైరతాబాద్ – పంజాగుట్ట మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసింది. కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే కారులో మంటలు చెలరేగడంతో పాదచారులు భయంతో పరుగులు పెట్టారు.