సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఐకియా రోటరీ వైపు వచ్చే అన్ని రూట్లలోని వాహనాలను మళ్లిస్తున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ తెలిపారు. మార్చి 22 నుంచి అమల్లోకి వస్తాయన్నారు.
సైబర్ టవర్స్కు వెళ్లాలనుకునేవారు ఐకియా అండర్పాస్ నుంచి వెళ్లాలి, కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లేవారు ఐకియా రోటరీ వద్ద కుడి వైపు తీసుకొని కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లాలి.
రోటరీ వద్ద నుంచి వెళ్లే వారు యూ టర్న్ తీసుకొని వెళ్లేందుకు అవకాశముంటుంది.
రోటరీలోకి వచ్చిన తరువాత కుడివైపు తీసుకునేందుకు అవకాశముంటుంది. అలాగే ప్రీ లెఫ్ట్ నుంచి కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లాలి.
బయోడైవర్సిటీ జంక్షన్కు వెళ్లాలనుకునే వారు ఐకియా అండర్పాస్ నుంచి వెళ్లాలి.
ఐకీయా రోటరీ నుంచి నేరుగా వెళ్లి సీ గేట్ మొదటి యూటర్న్ను ఉపయోగించుకొని బయోడైవర్సిటీ వైపు వెళ్లాలి.