CM KCR | ట్రాఫిక్ డ్యూటీ అంటేనే రిస్క్. రోడ్డు మీద ఎండలో, వానలో పని చేయాలె. కూర్చునే అవకాశమే ఉండదు. ఎండకు బాడీ బాగా డీహైడ్రేషన్ అయితది. అట్లనే పొగ, దుమ్ము పీల్చాలె. పొల్యూషన్తోని స్కిన్ ప్రాబ్లమ్స్, గుండె జబ్బులు, అస్తమా, టీబీ, షుగర్ వస్తయి. కంటి చూపు తొందరగా తగ్గుతది. నిలబడీ నిలబడీ మోకాళ్లు నొస్తయి. కొంతమంది రోడ్డు మీదనే బైక్లు, కార్లు పార్కింగ్ చేస్తరు. ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండ వాటిని జరపాలె. బైక్లను జరిపీ..జరిపీ బ్యాక్ పెయిన్, ఒళ్లు నొప్పులు వస్తయి. యాభై ఏళ్ల తర్వాత ఈ డ్యూటీ చానా కష్టంగా ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ తప్పకుండ వస్తయి. ట్రాఫిక్ని క్లియర్ చేయాలి. మోకాళ్లు నొచ్చినా, నీరసమొచ్చినా రెస్ట్ తీస్కోనీకి చాన్స్ ఉండదు. కాసేపు వదిలేస్తే ట్రాఫిక్ జామ్ అయిపోతది.
ఒంట్ల హుషార్ లేకున్నా పని చేయాలె. పనిల కొంతమంది రివర్స్లో మాట్లాడతరు. అయినా మేం పబ్లిక్తో పొలైట్గా మాట్లాడాలె. మస్త్ టెన్షన్ ఉంటది. తొందరగ బీపీ జబ్బు వస్తది. ఇన్ని బాధలు పడుకుంట హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నం. మా కష్టాన్ని గుర్తించిన కేసీఆర్ సార్ శాలరీలో ముప్పై శాతం రిస్క్ అలవెన్స్ ప్రకటించి ఇస్తున్నడు. దేశంలో ఇట్ల ఏ రాష్ట్రంల ఇయ్యట్లే. ఒక్క తెలంగాణ గవర్నమెంటే మా కష్టాన్ని గుర్తించి, దానికి తగిన ప్రతిఫలం ఇస్తున్నది. ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్యూటీ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలె. మంచి ఫుడ్ తింటే జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. ఈ రిస్క్ అలవెన్స్ రాబట్టి మంచి ఫుడ్ తీసుకోగలుగుతున్న. మా కష్టాన్ని, ఆరోగ్య సమస్యల్ని తెలుసుకుని మేలు చేసిన కేసీఆర్ సార్ని ఎప్పటికీ గుర్తుంచుకుంట.
– రితేష్ సింగ్, ట్రాఫిక్ కానిస్టేబుల్, అసిఫ్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, హైదరాబాద్