మేడ్చల్, జూన్ 11: విధులు అందరూ నిర్వహిస్తారు. కానీ కొంత మంది మాత్రమే ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, అంకిత భావంతో పని చేస్తారు. మేడ్చల్ ట్రాఫిక్ సీఐ నర్సింహారెడ్డి ప్రమాదాల నివారణే లక్ష్యంగా పలు చర్య లు చేపడుతూ ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు భద్రతా నియ మాలపై చర్యలు తీసుకుంటూ గుర్తింపు పొందారు. ఆయన సేవలను గుర్తింపుగా పోలీసు శాఖ దశాబ్ది ఉత్సవాల్లో ఉత్తమ సేవా పురస్కారాన్ని అందజేసింది.
ప్రమాదాల నివారణకు చర్యలు
మేడ్చల్, శామీర్పేట మండలాల పరిధిలో ఉన్న జాతీయ రహదారి 44, రాజీవ్ రహదారిపై ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా మేడ్చల్లో ఈ రెండు మండలాలకు సంబంధించి, ట్రాఫిక్ పోలీస్స్టేషన్ను గత ఏడాది ఆగస్టులో ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సీఐగా నర్సింహారెడ్డి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రమాదాలకు నివారణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన తీసుకున్న చర్యలతో రెండు జాతీయ రహదారులపై ప్రమాదాలు 50 శాతం మేరకు తగ్గాయి. మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో రేకుల బావి వద్ద, మేడ్చల్-శామీర్పేట దారిలో ఓఆర్ఆర్పై, రాజీవ్ రహదారిపై అటవీ అతిథి గృహం వద్ద స్పీడ్ గన్లు ఏర్పాటు చేశారు. యూటర్న్ల వద్ద రంబుల్ స్ట్రిప్స్, స్టడ్లు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి వేగ నియంత్రణకు బారికేడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. మున్సిపాలిటీ చైర్పర్సన్ లు, సర్పంచ్లతో మాట్లాడి చీకటి ఉన్న ప్రాంతాల్లో వీధి దీపాలను ఏర్పా టు చేయించారు. గౌడవెల్లి కమాన్, నల్సార్ యూనివర్సిటీ, శామీర్పేట తదితర చోట్ల దీపాలను ఏర్పా టుకు చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలతో గతంలో 75 నుంచి 80 ప్రమాదాలు జరుగుగా ప్రస్తుతం ఆ సంఖ్యలో 35 నుంచి 40కు తగ్గింది.
రోడ్లకు మరమ్మతులు
మేడ్చల్, శామీర్పేట మండలాల పరిధిలో జాతీయ రహ దారులు, ప్రధానదారుల్లో రోడ్లు గుంతల పడడం, ధ్వంసమై ప్రమాదకరంగా మారితే వాటి బాగుకోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దాతల సహకారంతో గుంతలను పూడ్చి వేయించడం, పాడైన రోడ్లను తాత్కాలికంగా బాగు చేయిస్తు న్నారు.మేడ్చల్-గండిమైసమ్మదారిలో సుతారిగూడ, అయో ధ్య చౌరస్తా, మేడ్చల్ పారిశ్రామికవాడలో జాతీయ రహదారిపై, కిష్టాపూర్ రోడ్డు, కేఎల్ఆర్ వెంఛర్, కోర్టు రోడ్డు తదితర తదితర చోట్ల బీటీ రోడ్డును బాగు చేయించారు.
ప్రజలకు అవగాహన
ప్రమాదాలకు 80 నుంచి 90 శాతం కారణంగా రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడమే అని గుర్తించి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు, రోడ్డుపై డ్రైవర్లు, ప్రజలకు భద్రతా నియమాలు పాటించకపోతే ఎదురయ్యే పర్యవసానాలు వివరిస్తున్నారు. క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
జీరో ప్రమాదాలే లక్ష్యం
మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో జీరో ప్రమాదాలే తమ లక్ష్యం. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే జీరో ప్రమాదాలను సాధించడం పెద్ద కష్టమేమి కాదు. హెల్మెల్ తప్పకుండా ధరించాలి. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు, డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ను వినియోగించవద్దు. ట్రాఫిక్ సిగ్నల్స్ను అతిక్రమించద్దు. భద్రతా నియమాలపై పిల్లలకు అవగాహన కల్పిస్తే ఎవరి సాయం లేకుండా రోడ్డు పైకి సురక్షితంగా వెళ్లి రాగలుగుతారు. -నర్సింహారెడ్డి, ట్రాఫిక్ సీఐ, మేడ్చల్