సిటీబ్యూరో,డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలో పనిచేసే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం టీఎస్ ట్రాన్స్కో, టీఎస్ జెన్కో సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈసందర్బంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం అధ్యక్షులు కె.వి.జాన్సన్, ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాష్లు మాట్లాడుతూ.. 2022 ఏప్రిల్ నెల నుంచి విద్యుత్ సంస్థలో పనిచేసే కార్మికులకు, ఉద్యోగులకు, ఆర్జిన్లకు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు వేతన సవరణ చేయాల్సి ఉండడంతో కమిటీ నియమించాలని కోరామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు గ్రాట్యుటీని రూ.12లక్షల నుంచి రూ.16లక్షలకు పెంపుదల చేసి అమలు చేస్తున్నందున దీన్ని విద్యుత్ శాఖల్లోనూ అమలు చేయాలని,అదేవిధంగా ఉద్యోగులకు హెచ్ఆర్ఎ పెంపుదలను 1-04-2020 నుంచి వర్తింపు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు.
తమ విజ్ఞప్తికి స్పందించిన సీఎండీ త్వరలో సీఎం కేసీఆర్తో సమావేశం ఉంటుందని, ఉద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
సీఎండీని కలిసిన వారిలో జెన్కో కార్యదర్శి చారుగుండ్ల రమేష్, ట్రాన్స్కో కంపెనీ అధ్యక్ష కార్యదర్శులు ఎం.దేవేందర్రెడ్డి, పి.రాములు, ఎస్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.డి.యూసుఫ్, కరెంటు రావు, ఎస్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్ష కార్యదర్శికులు రాందాస్, ప్రభాకర్, జెన్కో అధ్యక్షులు రఘోత్తం, ఉపాధ్యక్షులు కె.కరుణాకర్ రెడ్డిలు ఉన్నారు.