భార్య చెప్పినట్లు విడాకుల ఒప్పందంపై సంతకం పెట్టాలని బాధితుడిని పోలీసులు చిత్ర హింసలు పెట్టారు. “డీసీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది.. మేం చెప్పినట్లు చేయాలని అరికాళ్లు, చేతులపై విచక్షణా రహితంగా కొట్టారు. లబోదిబోమని మొత్తుకున్నా.. నోట్లో కర్రలు కుక్కి మరీ చితకబాదారు.” ఈ ఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్లో జరిగింది. కాగా, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ ఉన్నతాధికారులు తెలిపారు.
కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 26: భార్య చెప్పినట్లు విడాకుల ఒప్పందంపై సంతకాలు చేయాలి.. లేకుంటే తాట తీస్తామన్నారు. దాహం వేస్తుందంటే ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి నోట్లో ఉచ్చపోస్తామని బెదిరించారు. డీసీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది.. “మేము చెప్పినట్లు ఒప్పుకుంటావా.. లేదా.. అంటూ”.. అరికాళ్లు, అరిచేతులు, మోకాళ్లపై విచక్షణా రహితంగా కొట్టి చిత్ర హిం సలకు గురిచేశారు. బాధితుడు లబోదిబోమని మొత్తుకుంటే నోటిలో కర్రలు పెట్టి మరీ చితకబాదారు. ఉద యం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అసభ్యకరంగా దూషిస్తూ.. విచక్షణా రహితంగా ఓ వ్యక్తిపై దాడి చేశారు. సినిమాల్లోనే కనిపించే ఇలాంటి ఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన మొవ్వ ప్రవీణ్ వివాహం అదే జిల్లాకు చెందిన అన్నమనేని శ్రీలక్ష్మితో 2018లో జరిగింది. కొన్నాళ్లకు వీరికి ఓ పాప పుట్టింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. భార్య ఫిర్యాదు మేరకు గుంటూరులోని దిశ పోలీస్ స్టేషన్లో ప్రవీణ్పై గృహహింస కేసు పెట్టింది. ప్రస్తుతం ప్రవీణ్ నిజాంపేటలో నివసిస్తూ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు.
ప్రవీణ్ వద్ద తన సర్టిఫికెట్లు ఉన్నాయని, వాటిని ఇప్పించాలని భార్య శ్రీలక్ష్మి కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. స్టేషన్ ఎస్సై గురువారం ప్రవీణ్కు ఫోన్చేసి, ఇన్స్పెక్టర్ పిలుస్తున్నారని చెప్పి స్టేషన్కు రప్పించుకున్నాడు. 4 గంటల పాటు స్టేషన్లో ఉంచుకుని తిరిగి పంపించారు. శనివారం ఉదయం ప్రవీణ్ను మరోసారి స్టేషన్కు పిలువగా.. గుంటూరులో శ్రీలక్ష్మి ఫిర్యాదు మేరకు నమోదైన కేసు విచార ణ జరుగుతున్నదంటూ సంబంధిత పత్రాలను పోలీసులకు చూపించాడు. అలాగే, తాను కూడా ఆమెపై ఫిర్యా దు చేసినట్లు చెప్పాడు. దీంతో ఎస్సై సందీప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఫోన్లు, ఇతర వస్తువులు లాక్కొని.. ఇన్స్పెక్టర్ చాంబర్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఎస్సై, కానిస్టేబుల్ అసభ్య పదజాలంతో చిత్రహింసలు పెట్టారు. డీసీపీ ఆఫీస్ నుంచి ఏసీపీ సార్కు ఫోన్కాల్ వచ్చింది.. అందుకే విచారిస్తున్నాం.. ‘నీ భార్యకు సంబంధించిన సర్టిఫికెట్లు ఇవ్వాలి.. నీ భార్య చెప్పినట్లు విని కేసును పరిష్కరించుకోవాలి.. లేకుంటే మీ తల్లిదండ్రులు, బం ధువులను కూడా జైల్లో వేస్తాం’.. అంటూ బెదిరించారు. చివరకు రాత్రి సమయంలో బంధువుల పూచీకత్తు మేరకు వదిలేశారని బాధితుడు వాపోయాడు. విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు పేరుతో ఓ వ్యక్తిని చిత్రహింసలకు గురిచేసిన ఘటన వెలుగులో కి రావడంతో మంగళవారం స్టేషన్ను అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ శివభాస్కర్ సందర్శించారు. ఘటన తీరును తెలుసుకున్నారు. బాధితుడు, పోలీసుల నుంచి కూడా వివరణ తీసుకుని నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. దర్యాప్తు చేసిన తర్వాత బాధ్యులైన వారిపై చర్యలుంటాయని ఏసీపీ తెలిపా