హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్కు మంగళవారం మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే 46 రోజుల్లో ఒక రోజు మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశం కల్పించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ఆశ్విన్ మార్గం తెలిపారు. మహిళలతో పాటు 18 ఏండ్ల లోపు అబ్బాయిలకు అనుమతి ఉంటుంది. ఇక ఎగ్జిబిషన్లో ఇవాళ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాధారణ టికెట్ రూ. 40తోనే మహిళలకు ప్రవేశం కల్పించనున్నారు.