సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : నగరంలోని అన్ని దారులు ఉప్పల్ స్టేడియం వైపునకే చూపిస్తున్నాయి. బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబాయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్లు వీక్షిస్తూ సందడి చేస్తున్న నగర అభిమానులు.. సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ కావడంతో వీక్షించేందుకు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
అందులో భాగంగా గ్రేటర్ ఆర్టీసీ క్రికెట్ అభిమానుల కోసం నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నది. ఈ మేరకు మంగళవారం గ్రేటర్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.