సుల్తాన్బజార్, జనవరి 12 : 72 ఏళ్ల చరిత్ర కలిగిన టీఎన్జీవో సంఘంపై ఎవరైనా బురద చల్లాలని చూస్తే ఉపేక్షించేది లేదని టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ అన్నారు.
శుక్రవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో టీఎన్జీవో నగర శాఖ అధ్యక్ష, కార్యదర్శులు కట్కూరి శ్రీకాంత్, హరికృష్ణ ఆధ్వర్యంలో 2024 క్యాలెండ్ ఆవిష్కరణ సభకు కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణ గౌడ్, హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, నాల్గవ తరగతి కేంద్ర సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, నగర అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించారు.