సుల్తాన్బజార్, జనవరి 10. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు, సర్కారుకు వారధిగా ఉండాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ ఆధ్వర్యంలో బుధవారం ఎల్బీ స్టేడియంలో 9వ స్పోర్ట్ మీట్, గేమ్స్ -2024ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్,జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం అనంతరం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన టీఎన్జీవో సంఘానికి ఎంతో గుర్తింపు ఉందన్నారు. ఉద్యోగుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు జిల్లా శాఖ అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు. వీరోచిత పోరాటం చేసి కరీంనగర్లో తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరులకు స్థూపాన్ని నిర్మించడంతో పాటు ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఘనత టీఎన్జీవో సంఘానికే దక్కుతుందన్నారు.
టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ఉద్యోగులు క్రీడల్లో పాల్గొని నేటి తరం యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. ఎనిదేండ్లుగా ముజీబ్ హుస్సేనీ ఆధ్వర్యంలో స్పోర్ట్ మీట్ను విజయవంతంగా నిర్వహించి.. ఉద్యోగులు ఆరోగ్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ మాట్లాడుతూ యెట్టం సదానంద్ క్రికెట్ మెమోరియల్తో పాటు ఇతర ఇండోర్ గేమ్లను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు వివరించారు.గురువారం జరిగే ఫైనల్ క్రికెట్తో స్పోర్ట్మీట్ ముగుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్జీఈఎఫ్ అధ్యక్షుడు సుభాష్ లాంబా, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటనారాయణ, టీఎన్జీవో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకట్, కార్యదర్శి చంద్రశేఖర్ గంగపుత్ర, సభ్యులు ఉమాదేవి, శైలజ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, సీమా ముజీబ్, నాలుగో తరగతి కేంద్ర సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, కార్యదర్శి గంగాధర్, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ కార్యదర్శి విక్రమ్కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్కుమార్, కోశాధికారి బాలరాజ్, ఉపాధ్యక్షులు ఉమర్ఖాన్, కురాడి శ్రీనివాస్, మురళీరాజ్, నరేశ్ కుమార్, సంయుక్త కార్యదర్శి ఖాలేద్ అహ్మద్, సభ్యులు సుజాత, గీత, వెంకట్రెడ్డి, శంకర్, ముఖీం ఖురేషీ, శ్రీధర్ నాయుడు, ఈఎన్టీ యూనిట్ అధ్యక్షుడు తూముకుంట రాజు, పీఆర్వో సయ్యద్ జహంగీర్ అలీ, ఏపీఆర్వో మహ్మద్ వహీద్, మహ్మద్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.