హైదరాబాద్ : టీఎన్జీవో యూనియన్ ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగమని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నా రు. సోమవారం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ నేతృత్వంలో జిల్లా నాయకులతో కలిసి హోం మంత్రి చాంబర్లో కలిసి మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగుల ససమస్యల పట్ల టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా నిరంతరం కృషి చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వంలో టీఎన్జీవో ఒక భాగం అని కొనియాడారు. సీఎం కేసీఆర్ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పాటు పడుతున్నారన్నారు.
టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ మాట్లాడుతూ.. టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖపై హోం మంత్రి మహమూద్ అలీ అందిస్తున్న సహాయ సహాకారాలకు గాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజులలో టీఎన్జీవో యూనియన్ ఎల్లవేళలా రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు కృషి చేస్తామని అన్నారు.
కార్యక్రమంలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ కార్యదర్శి ఎస్ విక్రమ్ కుమార్, కోశాధికారి జే బాలరాజు, ఉపాధ్యక్షులు కేఆర్ రాజ్కుమార్, ఉమర్ఖాన్, సంయుక్త కార్యదర్శి ఖాలేద్ అహ్మద్, కె హరిబాబు, ప్రచార కార్యదర్శి కురాడి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు బి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
స్కూళ్లు ఇలా మూసి ఉండటం చాలా ప్రమాదకరం.. వెంటనే తెరవండి!
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావుకు నివాళులు అర్పించిన వినోద్ కుమార్
మోదీజీ పుట్టగొడుగులు మానేసి ఐదు రోజులు ఈ ఆహారం తీసుకోండి!
ఆధ్మాత్మికతో పాటు ఆహ్లాదానికి ప్రాధాన్యం : మంత్రి ఐకే రెడ్డి
సమాజానికి దారి చూపే రచనలు రావాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్