సుల్తాన్బజార్,డిసెంబర్ 31 : టీఎన్జీవో ఆయుష్ యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. శనివారం ఆయుష్ విభాగంలో టీఎన్జీ వో హైదరాబాద్ జిల్లా శాఖ ప్రచార కార్యదర్శి వైదిక్ శస్త్ర ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అధ్యక్షుడిగా టి.నరసింహాచారి, ఉపాధ్యక్షులుగా పి.సతీశ్కుమార్, బీహెచ్ ఎన్వీ శ్రీనివాస్, సీహెచ్ సుగుణమ్మ, కార్యదర్శి ఎస్.లక్ష్మణ్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా టి. సందీప్, కార్యనిర్వాహణ కార్యదర్శిగా డీఆర్ విషాల్ సాయి, కార్యవర్గ సభ్యులుగా ఆర్.భార్గవ ప్రసాద్, మహమ్మద్ అబ్దుల్ నయీం, పి.సుధాకర్, బి.అమర్నాథ్ ఎన్నికైనట్లు వివరించారు. నూతనంగా ఎన్నికైన యూనిట్ సభ్యులకు టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎం.ముజీబ్హుస్సేనీ నియామక పత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం సభ్యురాలు ఉమారెడ్డి, జిల్లా శాఖ ఉపాధ్యక్షులు ఉమర్ఖాన్, కురాడి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి ఖాలేద్ అహ్మద్, సభ్యులు ముఖీం ఖురేషి, శంకర్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం కోసమే..
హైదరాబాద్ జిల్లా పరిధిలోని వివిధ యూనిట్లలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే ఉద్యోగుల సమస్యల యాత్రను నిర్వహిస్తున్నట్లు టీఎన్జీవో హైద రాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎం. ముజీబ్హుస్సేనీ అన్నారు. ఈ మేరకు ఆయన జిల్లా కార్యవర్గంతో కలిసి శనివారం ఉద్యోగుల సమస్యల యాత్రలో భాగంగా మూడో రోజు ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, మల్లేపల్లి ఐటీఐ, నిలోఫర్ దవాఖాన, ఎంఎన్జే క్యాన్సర్ దవాఖాన, రెడ్ హిల్స్లోని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్ యూనిట్లను సందర్శించి ఆయా యూనిట్లలో నెలకొన్న ఉద్యోగుల సమస్యల ను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జనవరి 6న నిర్వహిస్తున్న 2023 క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా శాఖ కార్యదర్శి ఎస్.విక్రమ్కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్కుమార్, ఉపాధ్యక్షులు కురాడి శ్రీనివాస్, సభ్యులు ఖాలేద్ అహ్మద్, మహమ్మద్ అబ్దుల్ ముజీబ్, వైదిక్ శస్త్ర, శంకర్ పాల్గొన్నారు.