రంగారెడ్డి : మంటల్లో కాలుతున్న గుర్తుతెలియని మహిళ మృతదేహం(woman dead body) లభ్యమవడం స్థానికంగా కలకలం సృష్టించింది. రాంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారం గ్రామంలో ఉన్న డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పక్కన మంటలలో కాలుతున్న బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు మంటలు ఆర్పేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం పక్కన సగం కాలిన ఫోన్ ఉన్నట్లుగా గుర్తించారు. క్లూస్ టీంను రప్పించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంపి ఇక్కడ తీసుకొచ్చి తగులబెట్టారా? లేక ఇక్కడే హత్య చేసి తగులబెట్టారా? అనే కోణంలో సైతం విచారణ చేపట్టారు.