హైదరాబాద్ : రాచకొండ కమిషనరేట్ జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. మల్కారం ఈదుళ్ల చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు బుధవారం మృతి చెందారు. ఆరుగురు విద్యార్థులు కలిసి సరదా ఈత కొట్టేందుకు కలిసి వెళ్లగా.. ప్రమాదవశాత్తు ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను నీటిలో నుంచి వెలికి తీశారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకున్నది. మృతులకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉన్నది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.