హైదరాబాఆద్ : శిథిలావస్థలో ఉన్న ఓ ఇంటిని కుల్చుతుండగా ఇంటి గోడ కూలి(Wall collapsed) మీదపడటంతో ముగ్గురు తీవ్ర గాయాలయ్యాయి(Seriously injured). ఈ విషాదకర సంఘటన కుల్సుంపురా పోలిస్ స్టేషన్ పరిధిలోని పురానాపుల్ భీమ్ నగర్ కాలనీ(Bhimnagar Colony)లో సోమవారం చోటు చేసుకుంది. అహ్మద్, ఐజాజ్తో పాటు అక్కడే నిలబడి ఉన్న మరో వ్యక్తి పై గోడ పడడంతో తీవ్రంగా గాయపడ్డారు.
ఆ ముగ్గురిని వెంటనే స్థానికులు ఒస్మానియా దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంటి యజమాని శివ రాజ్ ఎలాంటి సేఫ్టీ చర్యలు తీసుకోకపోవడం వల్లో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న కుల్సుంపురా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.