హైదరాబాద్: హైదరాబాద్లోని (Hyderabad) బంజారాహిల్స్లో (Banjarahills) కారు బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో రెయిన్ బో దవాఖాన వద్ద ఆగి ఉన్న డీసీఎం (DCM) వాహనాన్ని కారు ఢీకొట్టింది. దీంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డుతోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు ప్రారథమికంగా అంచనాకు వచ్చారు.