అబిడ్స్, జనవరి 14 : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి అరబ్ దేశాల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ సంవత్సరం శ్రీరామ నవమి శోభయాత్ర తీస్తే చంపేస్తామంటూ హెచ్చరించారు. గతంలో అరబ్ దేశాల నుంచి పలుమార్లు ఎమ్మెల్యే రాజాసింగ్ను చంపేస్తామంటూ బెదిరించారు. శ్రీరామ నవమి రోజున శోభయాత్ర తీయవద్దంటూ 7199942827, 4223532270 ఫోన్ నంబర్ల నుంచి చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో తాజా బెదిరింపులకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. గతంలో వచ్చిన బెదిరింపులపై రాష్ట్ర డీజీపీకి, పోలీసు కమిషనర్కు, మంగళ్హాట్ పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా.. తనను బెదిరించిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాజాసింగ్ గతంలో పలుమార్లు పేర్కొన్నారు. తాజా బెదిరింపుపై స్థానిక మంగళ్హాట్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ను వివరణ కోరగా.. తనకు ఎమ్మెల్యే రాజాసింగ్ ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.