వెంగళరావునగర్, జూలై 23 : మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మదర్ థెరిస్సా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రహ్మత్నగర్ డివిజన్ ఓంనగర్లో ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. కార్మిక నగర్ కూడలి లోని అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకుని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మదర్ థెరిస్సా ట్రస్ట్ చైర్మన్ సుందర్రాజ్ మాట్లాడుతూ సమాజం సిగ్గుతో తలదించుకునేలా ప్రవర్తించిన ఆ ద్రోహులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మణిపూర్లో పరిస్థితులు చక్కబడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మదర్ థెరిస్సా ట్రస్ట్ అడ్వైజర్ మ లాకీ, కోశాధికారి జైషిల్, కార్యదర్శి మార్టిన్, సభ్యులు నవీన్, శిరోన్, మోజెస్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంను బర్తరఫ్ చేయాలి…
హిమాయత్నగర్, జూలై 23: మణిపూర్లో ఇద్దరు ఆదివాసి మహిళలను నగ్నం గా ఊరే గించి లైంగిక దాడితో పాటు హత్యచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల్ మల్లేశ్,ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జాతీయ కార్యదర్శి డాక్టర్ కూనంనేని రజిని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మణిపూర్లో శాంతి భద్రతలు కాపాడటంలో విఫలమైన ఆ రాష్ట్ర సీఎంను బర్తరఫ్ చేయాలని కోరుతూ ఆదివారం హిమాయత్నగర్లో నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు ఆర్.అంజయ్య నాయక్,ఉస్తేల సృజన,మారుపాక అనిల్కుమార్,పుట్ట లక్ష్మ ణ్,జమున, కాంతయ్య, మణి కంఠరెడ్డి, శ్రీమాన్, ప్రభులింగం,లక్ష్మి,స్వరూప పాల్గొన్నారు.