హైదరాబాద్ : మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో 6 అర్బన్ ఫారెస్ట్ పార్కులు (అటవీ ఉద్యానవనాలు) ఓకే సారి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
హైదరాబాద్ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కులను రేపు (గురువారం) అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు.
ఔటర్ రింగురోడ్డు, చుట్టుపక్కల సమీపంలో ఉన్న పార్కులను..ఉదయం 9 గంటలకు నాగారం, 10.35 గంటలకు పల్లెగడ్డ, 11 గంటలకు సిరిగిరిపూర్, 11.30 గంటలకు శ్రీ నగర్, మధ్యాహ్నం 12 గంటలకు తుమ్మలూర్, 12.40 గంటలకు మన్యంకంచ అర్బన్ ఫారెస్ట్ పార్క్ లను ప్రారంభిస్తారు.