గోల్నాక : ఏటీఎంలో గుర్తు తెలియని దొంగలు చోరీకి యత్నించారు. ఈ ఘటన అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ పేరం సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్పేట ప్రధాన రహదారి క్రౌన్ ఫంక్షన్ హాల్ సమీపంలో గల ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలో సోమవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎం మిషన్ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.
ఎంతకీ మిషన్ తెరుచుకోక పోవడంతో అక్కడి నుంచి జారుకున్నారు. ఈ ఘటనలో మిషన్ కొంత మేర ధ్వంసం కాగా.. బ్యాంకు అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.