జవహర్నగర్, జనవరి 1: తాగుడుకు బానిసై యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. చంద్రశేఖర్ కథనం ప్రకారం… జమ్మిగడ్డలోని నెహ్రూనగర్లో వేముల సత్యనారాయణ, భార్య పద్మ, కుమార్తె, కుమారుడితో కలిసి నివాసముంటున్నారు. కుమార్తె చదువుకుంటుండగా, కుమారుడు వేముల మధు(20) యాప్రాల్లోని అపోలో ఫార్మసీలో పనిచేస్తున్నాడు.
శనివారం కొత్త బట్టలు, బూట్లు కొనుక్కొని ఇంటికి వస్తున్నానని తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. కుమారుడి కోసం ఎదురు చూసిన కుటుంబసభ్యులు సమయానికి రాకపోవడంతో నిద్రపోయారు. ఆదివారం ఉదయాన్నే ఇంటి ఆవరణలో సీలింగ్కు చీరతో ఉరివేసుకుని కనిపించాడు. చుట్టుపక్కలవారు గమనించి ఇంటి యజమానికి తెలిపారు. అతను వెంటనే కుటుంసభ్యులను లేపి చూసేసరికి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి పోలీసులకు సమచారం అందించారు.
తల్లిదండ్రులు కుమారుడి మరణంపై అనుమానాలు ఉన్నాయని రోధిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకి దింపి, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.