కాప్రా, అక్టోబర్ 30 : కాప్రా డివిజన్ గాంధీనగర్లో ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించిన పాదయాత్రకు స్థానికులనుంచి విశేష స్పందన లభించింది. గృహిణిలు మంగళ హారతులతో బీఎల్ఆర్కు స్వాగతం పలికి, నుదుట తిలకం దిద్ది ఆశీర్వదించారు. ఇంటింటికీ తిరిగి మహిళలకు, పెద్దలకు నమస్కరిసూ ్త రానున్న ఎన్నికల్లో తనను గెలిపించి ఆశీర్వదించాలని బీఎల్ఆర్ స్థానికులకు విజ్ఞప్తి చేశారు. ప్రధాన వీధుల్లో ఉన్న దుకాణాలు, వ్యాపారులను కలిసి ఎన్నికల్లో మద్దతు తెలుపాలని కోరగా,స్థానిక మార్వాడీ వ్యాపారులు సానుకూలంగా స్పందిస్తూ పూర్తి మద్దతు ప్రకటించారు. పాదయాత్రలో బీఎల్ఆర్పై పూల జల్లు కురిపిస్తూ, శాలువాలతో సత్కరిస్తూ, పాటలతో సందడి చేస్తూ ఊరేగించారు. ప్రతి ఇంటి వారు ఆయనకు మంగళ హారతి పట్టి వీర తిలకం దిద్ది ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ సంక్షేమసంఘం అధ్యక్షుడు ఎన్.మహేశ్, బీఆర్ఎస్ మైనారిటీ నాయకుడు బద్రుద్దీన్, బైరి నవీన్గౌడ్, మహిళా నాయకురాలు సురేఖ, స్థానిక సంక్షేమసంఘం, యూత్ ప్రతినిధులు, మహిళానేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రామంతాపూర్, అక్టోబర్ 30 : ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఉప్పల్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి ఓటర్లకు విజ్ఞపి చేశారు. సోమవారం రామంతాపూర్ డివిజన్లోని పాతరామంతాపూర్, రాంశంకర్నగర్, మధురానగర్, అరవింద్నగర్, కామాక్షిపురం, తదితర ప్రాంతాల్లో రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, పసుల ప్రభాకర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వర్రావు తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల కరపత్రాలను ఇంటింటికి పంచుతూ ప్రచారం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గత తొమ్మిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రతి ఇంటా చేరాయన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బం డారి లక్ష్మారెడ్డిని గెలిపించాలన్నారు. బండారి గెలుపు ద్వారా ఉప్పల్ నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చర్లపల్లి, అక్టోబర్ 30 : చర్లపల్లి డివిజన్లో చేపట్టిన ఎన్నికల ప్రచారానికి అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తుందని స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చర్లపల్లి డివిజన్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ అందించేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ రూపొందించిన ఎన్నికల మ్యానిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. డివిజన్లో బూత్కమిటీల వారీగా ప్రచారం నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగిళ్ల బాల్రెడ్డి, కనకరాజుగౌడ్, ప్రభుగౌడ్, కడియాల యాదగిరి, సానెం రాజుగౌడ్, మురళి, పాండు, వెంకట్రెడ్డి, నజీర్, పుష్పలత, అలీ, బాల్నర్సింహా, నవనీత, సత్తెమ్మ, లలిత, సోమయ్య, ము త్యాలు, రాధకృష్ణతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.
మల్లాపూర్, అక్టోబర్ 30 : ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన డివిజన్ పరిధిలోని దుర్గానగర్, బాబానగర్ కాలనీల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ సీఎం కేసీఆర్ చేసిన అభివృది,్ధ సంక్షేమ పథకాలపై ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కల్పించారు. రాష్ట్రంలో అభివృద్ధి జర గాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కాలనీవాసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మీర్పేట్ డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్ అన్నారు. ఎన్నికల ప్రచాంలో భాగంగా సోమవారం ఆయన డివిజన్ పరిధిలోని డైమండ్ హిల్స్ కాలనీలో డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మాజీ అధ్యక్షుడు వంజరి ప్రవీన్ కరిపెలతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి ఉప్పల్ నియోజకవర్గంలో అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు , స్థానికులు పాల్గొన్నారు.