బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్ ఇండియా-2024 వైమానిక ఎగ్జిబిషన్ అట్టహాసంగా ముగిసింది. నాలుగు
రోజులుగా వైభవంగా సాగిన ఈ ప్రదర్శనకు చివరి రోజు ఆదివారం భారీగా సందర్శకులు తరలివచ్చారు. విభిన్న విమానాలను చూసి మంత్రముగ్ధులయ్యారు.
లోహ విహంగాల విన్యాసాలను చూసి.. అబ్బురపడ్డారు. బోయింగ్, ఎయిర్ఇండియా, ఇండిగో విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిల్వగా.. వాటి వద్ద చిన్నారుల నుంచి వృద్ధుల వరకు సెల్ఫీలు తీసుకుంటూ..మురిసిపోయారు. జోగిపేట నుంచి వచ్చిన సుమలత అనే మహిళ హెలికాప్టర్లు గాలిలో చేసిన విన్యాసాలు చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. ఇలా చూడటం ఫస్ట్టైం అంటూ.. తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.