– ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
– మూడ్రోజుల పాటు జరుగనున్న ఉత్సవాలు
– తొలిరోజు అశా వర్కర్లు, ఏఎన్ ఎంలు, పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం
– అంబరాన్ని అంటిన మహిళా బంధు సంబురాలు
వెంగళరావునగర్ : మహిళా బంధు సంబురాలు అంబరాన్ని అంటాయి..అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వెంగళరావునగ ర్ డివిజన్ లోని కృష్ణకాంత్ పార్క్ వద్ద సభను నిర్వహించారు.
మూడ్రోజుల ఉత్సవాల్లో భాగంగా తొలిరోజున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అశా వర్కర్లు, ఏఎన్ ఎంలు, పారిశుద్ధ్య కార్మికులైన సుమారు వెయ్యి మంది మహిళా ఉద్యోగినులను ఘనంగా సత్కరించి వారికి బహుమతులను ఎమ్మెల్యే మాగంటి అంద చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ టీఆర్ ఎస్ ప్రభుత్వ పాలనలో అతివలకు అగ్రతాంబూలం ఇచ్చామన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల సంక్షేమం కోసం త మ ప్ర భుత్వం పాటు ప డుతుంద న్నారు. గతంలో అంగన్ వాడీ కార్యకర్తల కు కేవలం రూ.4,200 వేతనం ఉండేదని..తమ ప్రభుత్వం రూ.10,500 వేతనాన్ని అందిస్తుందని అన్నారు. ఆయాలకు గతంలో రూ.200 వేతనం ఉండగా..తమ ప్రభుత్వ పాలనలో రూ.6000 వేతనాన్ని ఇవ్వడం జరుగుతుందన్నారు.
జీహెచ్ ఎంసీ పారిశుద్ద్య కార్మికులకు గతంలో 8,500 ఉండేదని..ఇప్పుడు 17,500 వేతనాన్ని ఇస్తున్నామని వెల్లడించారు. ఆసరా, ఒంటరి మహిళలకు పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో షాదీ ముబారక్ , కళ్యాణలక్ష్మి పథకాల కింద 10 లక్షల 27 వేల 270 మంది లబ్థిదారులకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు.
కేసీఆర్ కిట్ ఆడపడుచులకు ఓ వరమని..ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, బాబు పుడితే రూ.12 వేలను ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. కేసీఆర్ కిట్ కింద ఇప్పటి వరకు రూ.17 వేల కోట్ల రూపాయలను ఇచ్చామని అన్నారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ నియోజవర్గ కార్పొరేటర్లు సీ.ఎన్ .రెడ్డి, రాజ్ కుమార్ పటేల్ , దేదీప్య విజయ్ , బాబా ఫసియుద్దీన్ , ఎస్పీహెచ్ ఓ డాక్టర్ అనురాధ, ఏఎమ్ హెచ్ ఓ బిందు భార్గవి, శ్రీనగర్ కాలనీ టీఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అప్పు ఖాన్ తదితరులు పాల్గొన్నారు.