గోల్నాక, జూన్ 4 : దేశంలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉన్నది ఒక్క తెలంగాణలోనేనని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. షీ టీమ్స్తో మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పిస్తున్న ఘనత మనదేనన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మూడో రోజు అంబర్పేట పోలీస్స్టేషన్ అవరణలో సురక్షా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ.. శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్న రాష్ట్రమే సమగ్రాభివృద్ధి సాధిస్తుందన్నారు. దేశానికైనా, రాష్ర్టానికైనా పెట్టుబడులు రావాలంటే ముఖ్యంగా అక్కడి శాంతి భద్రతలు ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు సీఎం కేసీఆర్ పోలీసులకు వాహనాలు, కొత్త పోలీస్స్టేషన్ల నిర్మాణం, ఆధునిక టెక్నాలజీతో పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. తద్వారా తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్వన్గా నిలిచారని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయ్కుమార్గౌడ్, దూసరి లావణ్యా శ్రీనివాస్గౌడ్, బి.పద్మావెంకట్రెడ్డితో పాటు ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్రెడ్డి, ఇన్చార్జి ఏసీపీ శ్రీనివాస్, అంబర్పేట తాశీల్దార్ లలిత, డీఎంసీ వేణుగోపాల్, అంబర్పేట సీఐ డి.అశోక్తో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
అంబర్పేటలో మహిళా పోలీస్స్టేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయమని మాజీ కార్పొరేటర్ కె.పద్మావతీడీపీ రెడ్డి అన్నారు. ఆదివారం అంబర్పేట పోలీస్స్టేషన్లో నిర్వహించిన సురక్షా దినోత్సవంలో పాల్గొన్న ఆమె మహిళా పోలీసులను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్రెడ్డి పాల్గొని అంబర్పేట పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు.
కాచిగూడ : తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని బీఆర్ఎస్ నగర నాయకుడు ఎక్కాల కన్నా అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎక్కాల కన్నా ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడ పోలీస్స్టేషన్లో సురక్షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాచిగూడ సీఐలు, ఎస్ఐలు, సిబ్బందిని సన్మానించారు. అనంతరం కన్నా మాట్లాడుతూ శాంతి భద్రతల్లో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ప్రతి బస్తీ పౌరుడు నేరాలను నియంత్రిచేందుకు పోలీసులకు సహకరించాలని ఆయన సూచించారు. డయల్ 100తో ప్రజలు పోలీసులకు మరింతగా దగ్గరయ్యారని, విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలిరావడం వెనుక తెలంగాణ పోలీసుల ఘనత ఉందన్నారు. కార్యక్రమంలో మున్నాసింగ్, అశోక్రెడ్డి, శివరాజ్, శేఖర్, సాగర్, కొండయ్య, జియా, ప్రకాశ్యాదవ్, రియాస్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు ఉత్తమ సేవాలందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థలో భారీగా మార్పులు తీసుకువచ్చిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోనె ప్రదీప్రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రదీప్రావు ఆధ్వర్యంలో ఆదివారం నల్లకుంట పోలీస్స్టేషన్లో సురక్షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో సన్నిహితంగా ఉంటూ సమర్థవంతంగా పని చేస్తున్నారన్నారు. పీఎస్కు వచ్చే బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నారని అన్నారు. న్యాయవాది మధుసూదన్రెడ్డి, గెల్వయ్య, భాస్కర్గౌడ్, రామారావుయాదవ్, నర్సింగ్యాదవ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.