బేగంపేట్ జనవరి 18: వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం ఎంతో అనుకూలంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో మంత్రిని సూర్య బెజవాడ ఆధ్వర్యంలో ఇండో -కెనడా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు జరుగుతున్న పలు సంక్షేమ కార్యక్రమాల గురించి మంత్రికి వారు వివరించారు. కుల వృత్తులకు ప్రభుత్వం పూర్వవైభవం తీసుకొచ్చిందన్నారు.
పరిశ్రమలు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతుందని చెప్పారు. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికి సురక్షితమైన తాగునీటిని సరఫరా చేస్తున్నట్టు వివరించారు. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం విదేశాలలో ఉన్నందున ఆయన వచ్చిన అనంతరం ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. మంత్రిని కలిసిన వారిలో ఇండో- కెనడా కో ఆర్డినేటర్ త్రిభువన్ ఆనంద్, వికాస్ గుప్తా, కల్పేష్జోషి తదితరులు ఉన్నారు.