హైదరాబాద్ : బడుగు, బలహీన వర్గాల సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేయూతనిస్తుందని చాత్తాద శ్రీవైష్ణవ సంఘం అధ్యక్షుడు అశ్వాపురం వేణుమాధవ్ అన్నారు. పీర్జాదిగూడలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో శ్రీవైష్ణవ సంఘం ఆత్మగౌరవ భవన్ నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకల జనులు ఒక్కేటనని వెయ్యేళ్ల కిందట భగవద్రామానుజుడు చాటి చెప్పిన స్ఫూర్తికి ఆత్మగౌరవ భవనాలు నిదర్శనమన్నారు.
సామాజిక సేవలో ముందున్న చాత్తాద శ్రీవైష్ణవులకు రాజకీయంగా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేశారు. 27న పీర్జాదిగూడలో జరిగే చాత్తాద శ్రీవైష్ణ సంఘం ఆత్మగౌరవ భవన్ భూమిపూజకు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం అధ్యక్షుడు తోమాల కొండస్వామి, తదితరులు పాల్గొన్నారు.