జీడిమెట్ల, జూన్ 21 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన పూజలు, సర్వమత ప్రార్థనలతో ఆధ్యాత్మిక శోభ సంచరించుకుంది. ఆయా కార్యక్రమాలలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్తో పాటు నాయకులు, పలువురు పాల్గొన్నారు.
రాజీవ్ గాంధీనగర్లో ఉన్న బుద్ద విహార్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే వివేకానంద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలను, మతాలను సమానంగా గౌరవిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బౌద్ద మత పెద్ద లు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
గురుద్వారాలో సిక్కు మతస్తులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, నాయకులు రంగా రావు, అడపా శేషు, పద్మజారెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
డివిజన్లోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన సుదర్శన హోమం, ప్రత్యేక పూజల లో ఎమ్మెల్యే వివేకానంద్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే సొంత నిధులతో 250 మంది అర్చకులకు దుస్తులు, (పంచ, దోవతి ) పంపిణీ చేశారు. దూప దీప నైవేధ్యం పథకంలో భాగంగా ప్రభుత్వం రూ.6 వేల నుంచి రూ.10 వేల వర కు పెంచి అందజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ జీడికంటి కృష్ణామాచార్యులు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సోమేశ్ యాదవ్, బీఆర్ఎస్ డివిజన్ల అధ్యక్షులు రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, పుప్పాల భాస్కర్, నాయకులు సయ్యద్ రషీద్, రషీద్ బేగ్, బస్వ రాజు, వేణుయాదవ్తో పాటు మత పెద్దలు పాల్గొన్నారు.
ఎంజే గార్డెన్లో ముస్లిం మైనార్టీ మత పెద్దలు ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ముస్లింల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు యూసుఫ్, రషీద్బేగ్, సయ్యద్ రషీద్, తదితరులు పాల్గొన్నారు.
మహరాజ గార్డెన్లో క్రిస్టియన్ మతస్తులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మత పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.