మారేడ్పల్లి : ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు ఎనలేనివని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం మారేడ్పల్లి మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్లో టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్తో కలిసి ఆశా వర్కర్ లకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ…పేద ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టిందని చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తున్న ట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పరీక్షలు, మందులు అందజేయబడుతున్నాయని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అంతే కాకుండా పేదలు అత్యధికంగా నివసించే బస్తీ లలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి పేదల ముంగిటికి ప్రభుత్వ వైద్య సేవలు తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇందులో కూడ సూమారు 56 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని తెలిపారు. పైవేటు ఆసుప త్రులకు వెళ్లి కేవలం పరీక్షలు కోసం వేలాది రూపాయాలు ఖర్చు చేయాల్సి వస్తుందని అన్నారు.
పేద, మధ్య తరగతి ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కోట్లాది రూపాయాల వ్యయంతో అత్యాధునిక ప రికరాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల అమలు లో స్మార్ట్ ఫోన్లు ఆశా వర్కర్లకు ఎంతో ఉపయోగపడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యధికారి డాక్టర్ వెంకట్, డాక్టర్ రాజ శ్రీ తదితరులు పాల్గొన్నారు.